భీమ్నగర్లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు
ఐ.పోలవరం: సెప్టెంబర్ 07( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)జి.మూలం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగరువు–భీమ్నగర్ పాఠశాల హెచ్ఎం ఎస్. అమీన్ ఐ.పోలవరం మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎర్రగరువు–భీమ్నగర్ అంబేద్కర్ యంగ్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఎస్. అమీన్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లత మంగేష్కర్, స్కూల్ చైర్మన్ భాస్కరరావు, రాంబాబు, గంగాధర్, పైడియ్య, వెంకట్, చందు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు గంగాధర్ మాస్టర్ తదితరులు ఎస్. అమీన్కు శుభాకాంక్షలు తెలిపారు.
