మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
సీఎం చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
• అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ముద్రగడ పద్మనాభం సేవలందించారని… అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
