*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను) బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు. ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.

*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను) బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు...