vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 10:25 am Posted by : VAARTHA GSB

152.96 కోట్లు తో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన*

*సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన*
ఆత్రేయపురం / ధవళేశ్వరం ,
13(జిఎస్ బి వార్త)
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఘనంగా నిర్వహించిన సభలో ప్రజాప్రతినిధుల ప్రసంగాలు
ధవళేశ్వరం నూతన సర్థర్ రాష్ట్ర వరద వరద గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన. శంకుస్థాపన చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సభాధ్యక్షులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ప్రారంభోపన్యాసకులు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ప్రసంగించారు.
*గోదావరి డెల్టా రైతాంగ రక్షకుడు సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు*
పేద ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు ప్రసాదించిన అవకాశంగా భావించి, రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న దూరదృష్టి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జలాలను సద్వినియోగం చేసి డెల్టా రైతాంగానికి సుస్థిర సాగుకు పునాది వేస్తే, నేడు అదే వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ముఖ్యమంత్రి స్వీకరించి రూ.152.95 కోట్లతో 117 వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రారంభించడం చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ వంటి సాగునీటి వ్యవస్థల నిర్వహణ, ఆధునీకరణ పనులకు గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించలేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టడం అభినందనీయమని అన్నారు.
సెంట్రల్ డెల్టా పరిధిలోని రెండు లక్షల ఎకరాల సాగుభూములకు ఉపయోగపడే లొల్ల లాకుల నిర్మాణానికి రూ.74 కోట్ల నిధులు ఇవ్వడం ముఖ్యమంత్రి రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. బిందు సేద్యం, వ్యవసాయ యంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవసాయం, రైతు బజార్ల అభివృద్ధి వంటి సంస్కరణలను ప్రస్తావించారు.
గోదావరి డెల్టా మోడరనైజేషన్ ఎత్తును వేగవంతం చేయడం, లంక భూములకు క్రోయిన్ల నిర్మాణం, ఏటిగట్ల పెంపు, వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
*డెల్టా రైతాంగానికి శాశ్వత భరోసా కల్పించే కార్యక్రమం: జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్*
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలందరికీ స్వాగతం పలికారు.
ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీరు బ్యాంకింగ్ జిల్లా ధవళేశ్వరం గోదావరి డెల్టా చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే సుమారు 10.13 లక్షల ఎకరాలకు నీటి సరఫరా మరింతగా సాగుతుంది. రూ.152.95 కోట్లతో 117 గేట్ల మార్పిడికి శ్రీకారం చుట్టడం డెల్టా రైతాంగానికి శాశ్వత భరోసాని కల్పిస్తూ ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
*ముఖ్యమంత్రి నాయకత్వంలో గోదావరి డెల్టా సాగునీటి రంగానికి పూర్వవైభవం: మంత్రి డా. నిమ్మల రామానాయుడు*
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి డెల్టాకు జీవనాడి అని వెలుగులోకి, కేంద్ర జల సంఘం సూచనల మేరకు బ్యారేజీ భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.
ముఖ్యమంత్రి గత పదవీకాలంలో కొత్త గేట్లు ఏర్పాటు చేసి గుర్తుచేస్తూ, ప్రస్తుతం మిగిలిన 117 గేట్లను రూ.150 కోట్లకు పైగా ఖర్చుతో మార్చినట్లు తెలిపారు. డెల్టా కాలువలు, డ్రైన్లు, లాకులు, షట్టర్ల నిర్వహణతో పాటు సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు 48 గంటల్లోనే ధాన్యం చెల్లింపులు జరిగేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని వివరించారు.
*గోదావరి డెల్టా అభివృద్ధికి దర్శనిక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్*
రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ డెల్టా రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 117 వరద గేట్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందింది. రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’, పేదల కోసం ఎన్టీఆర్ భరోసా, మహిళల కోసం దీపం–2.0, స్త్రీశక్తి వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
పిచ్చుకలంకలోని 62 ఎకరాల భూమిని సమగ్ర పర్యాటక అభివృద్ధికి వినియోగించుకునే జీవోలో అవసరమైన సవరణలు ముఖ్యమంత్రిని కేటాయించాయి. గోదావరి డెల్టా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
*నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం: ఎంపీ గంటి హరీష్ మాధుర్*
అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి.
ధవళేశ్వరం బ్యారేజీ వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించిందని, గతంలో పూర్తికాని పనులను ఇప్పుడు వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు.
కొబ్బరి రైతులకు అండగా నిలుస్తోందని, అమలాపురం ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి సహకారంతో త్వరలోనే సాకారం చేస్తున్నామని ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు.