vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 4:47 pm Posted by : వార్తా జిఎస్‌బి

1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలనికరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఇండియన్ క్రిస్టియన్ బ్లాక్ డే నిరసన 

1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని

కరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఇండియన్ క్రిస్టియన్ బ్లాక్ డే నిరసన ‎

కరప (జిఎస్ బి వార్త)

కరప మండలం పాస్టర్అ ఫేలోషిప్ అద్యక్షులు రెవ. డా. జె. పాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం కరప లో రెవ. వై. జాన్ మందిరంలో ఇండియన్ క్రిస్టియన్ బ్లాక్ డే , ఫెలోషిప్ జనరల్ బాడి సమావేశము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్. ఐ. జాన్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని,దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలని పిలుపునిచ్చారు. అనంతరం మన భారతదేశ క్షేమము కొరకు దైవ సేవకులు అందరూ ప్రార్థనలు చేసియున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ రెవ.కె. ఆనంద బాబు, ట్రెజరర్ రెవ. ఎస్ జోసఫ్ ప్రసాద్, మరియు ఫెలోషిప్ నాయకులు కమీటీ వారు మరియు కరప మండలంలో ఉన్న పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.