vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:44 am Posted by : వార్తా జిఎస్‌బి

కరప  లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్    వన్ విలేజ్ ఫోర్ విజిట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పిర్యాదు లు స్వీకరిస్తారు.

కరప  లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్   

వన్ విలేజ్ ఫోర్ విజిట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పిర్యాదు లు స్వీకరిస్తారు.

కరప (జిఎస్ బి వార్త)

కరప గ్రామం లో కలెక్టర్ సందర్శనలు

వన్ విలేజ్ ఫోర్ విజిట్

 

ఆర్ డి ఓ మల్లిబాబు

 

కరప (జిఎస్ బి వార్త)

 

ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కు సంబంధించి కరప చంద్రన్న సమావేశ మందిరము నందు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ హరెంద్ర ప్రసాద్ పాల్గొని పిర్యాదు లు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం కు సంబంధించి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఆర్డీవో ఎస్. మల్లిబాబు గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పాల్గొనే ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. నియోజకవర్గస్థాయి సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరితగరితిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో ఆర్డిఓ తో పాటు. కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ పోతురాజు. కరప తహసీల్దార్ ఆకుల సరస్వతి. రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి. సతీష్. మండల డిప్యుటీ ఎంపీడీఓలు ఎస్ శ్రీనివాస రావు,కర్రి శ్రీనివాస్ రావు, ఏ ఓ నరసింహారావు, డి ఆర్ డి ఏ అధికారులు స్థాయి అధికారులు పాల్గొన్నారు.