బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లా మదనపల్లె:
*ఉరేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్య*
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లె మారుతి నగర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు భాష తాను ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరికి వేలాడుతున్న భాషను గమనించిన పిల్లలు, కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందికి దించారు. అప్పటికే అతను మృతి చెందాడు. కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం కన్నీటి పర్యంతమైంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
