*జిజిహెచ్లో సదరం సహాయక కేంద్రం ఏర్పాటు*
*సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి*
కాకినాడ సిటీ జూలై 22 జి ఎస్ బి వార్త
వికలాంగత్వ నిర్ధారణ పరీక్షల కోసం సదరం స్లాట్తో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కి వచ్చే దివ్యాంగుల సౌకర్యార్థం ఓపి బ్లాక్ మెట్ల వద్ద ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సదరం నోడల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆదేశాల మేరకు ఈ హెల్ప్ డెస్క్ నుఅందుబాటులోకితీసుకువచ్చారు. ఆయా కేటగిరీల కింద వచ్చిన దివ్యాంగులకు ఏయే ఓపి విభాగాలను సందర్శించాలో ఈ కేంద్రంలో డ్యూటీలో ఉండే మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్లుదిశానిర్దేశంచేస్తారు.దివ్యాంగులు ఎటువంటి గందరగోళం లేకుండా నేరుగా సంబంధిత ఓపి విభాగానికి వెళ్లి తమ దివ్యాంగత్వ సర్టిఫికెట్ల కోసం వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు.ఈ సహాయక కేంద్రం పనితీరును డాక్టర్ మెహర్ కుమార్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
