బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
కాజులూరు( జిఎస్ బి వార్త) ఆగస్టు 8
సొంత గ్రామంలో ప్రజలకు తన వంతు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో, బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గునిపే బాలాజీ ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపై అవగాహన పెంచుకుని , న్యాయ విజ్ఞానముతో ప్రజలు మంచి జీవన విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ యేలూరు సుబ్రహ్మణ్యం కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో న్యాయవాది, బాలాజి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన పాల్గొని ప్రసంగించారు, మరొక సీనియర్ న్యాయవాది, శ్రీ బచ్చు రాజేష్ ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంచుకుని జీవించాలని సూచించారు. కాకినాడ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ న్యాయవాది శ్రీ యడ్ల కుటుంబరావు న్యాయవాది మాట్లాడుతూ పేద ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ప్రతి జిల్లా ఆవరణలో న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం కావాలంటే కాకినాడ జిల్లా కోర్టు ఆవరణలో గల మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని సంప్రదించి న్యాయ సహాయం పొందాలని సూచించారు .ప్రజలందరికీ ఉపయోగపడే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏర్పాటు చేసిన బాలాజీ దంపతులను ప్రముకులు సత్కరించారు అనంతరం బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులకు, నూతన వస్త్రాలను ప్రముఖుల చేతుల మీదుగా అందించారు,10వ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధికరాయుడు విజయ భాస్కర్,మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రోత్సాహాన్ని అందించారు కార్యక్రమంలో న్యాయవాదులు నాగభూషణం, పులిదిండి శేఖర్,సదస్సులో కవి మధునాపంతుల సత్యనారాయణ, వెంటపల్లి రమేష్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
