కరప వారహి అమ్మవారికి ముస్లిం యువకుడు పూజలు
కరప మండలం కొరిపల్లి లో వెలసిన కాశీ వారహి అమ్మవారి పూజల్లో పెనుగుదురు గ్రామానికి చెందిన బాష అనే ముస్లిం భక్తుడు నిత్యం పూజలు చేస్తున్నట్టు ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు తెలిపారు. మంచి జరిగితే ఏ మతం నుండైనా భక్తులు వస్తారు అని చెప్పాడానికి ఈ ముస్లిం ఉదాహరణ అని తెలిపారు. గురువారం వారహి అమ్మవారికి బంగారు, వెండి ఆభరణాలు తో ప్రత్యేక అలంకరణ చేసి ఆలయం నందు గురిపౌర్ణమి సందర్బంగా ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారీసంఖ్యలో భక్తులు పూజలు చేశారు. గుప్త నవరాత్రి వేడుకలు తరువాత నిత్యం భక్తులు తాకిడి అధికమైనట్టు తెలిపారు. రాజమండ్రి నుండి ప్రత్యేకంగా బస్సు ఆర్ టీ సి ఏర్పాట్లు చేయడం శుభపరిణామం గా దొరబాబు తెలిపారు. ఈ కార్యక్రమం లో చిక్కాల ఆదినారాయణ, భద్రరావు, బాష, అర్చకులు సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు
.

