కరప పీహెచ్సీ లో గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు
పౌష్టికాహారం పంపిణీ చేసిన డాక్టర్ డాక్టర్ పబ్బినీడి పద్మజా శ్రీదేవి
కరప(జిఎస్ బి వార్త) :
కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 9న ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకంలో భాగంగా వీరికి పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ . ఏంజలిన, డాక్టర్ అప్రోజ్ తెలిపారు. ఈ సందర్భంగా గురజానాపల్లి కి చెందిన నాయకులు పబ్బినీడి వెంకటకృష్ణ కుమార్తె ప్రముఖ చంటి పిల్లలు డాక్టర్ పబ్బినీడి పద్మజా శ్రీదేవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారన్ని పంపిణీ చేసినారు, వారి సేవ గుణాన్ని వైద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంజిలిన్, డాక్టర్అ ఫ్రోజ్, కరప ఏ ఎం సి చైర్మన్ ముద్రగడ్డ రమేష్, కాకినాడ టీడీపీ పార్లమెంట్ అద్వైజరి కమటీ నెంబర్ దేవు వెంకన్న, కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, గురజనాపల్లి పబ్బినీడి వెంకట కృష్ణ పీహెచ్ఎన్ సత్యనారాయణమ్మ, హెల్త్ అసిస్టెంట్ వను0 శ్రీనివాసరావు, ఎన్ . వీరభద్రరావు మంచాల శ్రీనివాస్, హెచ్ ఎస్. రాజగోపాల్ ,తదితరులు పాల్గొన్నారు.
